Webdunia - Bharat's app for daily news and videos

Install App

జల్ జీవన్ మిషన్ కింద రూ.4,000 కోట్లు దుర్వినియోగం.. పవన్ కళ్యాణ్

సెల్వి
బుధవారం, 18 డిశెంబరు 2024 (18:45 IST)
Pawan kalyan
జల్ జీవన్ మిషన్ కింద రూ.4,000 కోట్లు దుర్వినియోగం అయ్యాయని ఆరోపిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పనిలో పనిగా వైకాపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడలో గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం నిర్వహించిన జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
 
ఈ సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్, జల్ జీవన్ మిషన్‌ను బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిబద్ధతతో వుందని ఉద్ఘాటించారు. చాలా మంది ప్రజలు నీటి కొరతను ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యను పరిష్కరించడం అత్యంత ప్రాధాన్యతగా ఉండాలని పేర్కొన్నారు.
 
జనవరి చివరి నాటికి వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను తయారు చేసి, కేంద్ర జల్ శక్తి మంత్రికి ప్రతిపాదనలు సమర్పించే ప్రణాళికలను ఆయన ప్రకటించారు. ప్రతి వ్యక్తికి స్వచ్ఛమైన తాగునీటిని అందించే లక్ష్యంతో జల్ జీవన్ మిషన్ ప్రారంభించబడిందని పవన్ కళ్యాణ్ అన్నారు.
 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి వ్యక్తికి రోజుకు సగటున 55 లీటర్ల స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయాలని యోచిస్తున్నారని పేర్కొన్నారు. సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నుండి రూ.70,000 కోట్లు అభ్యర్థించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

పట్టణంలో కొత్త రాబిన్‌హుడ్ వచ్చింది ఓటీటీలోకి హరి హర వీర మల్లు

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments