Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు : రైలు బోగీలో మంటలు... విద్రోహ చర్యగా అనుమానం!

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (21:10 IST)
ఇటీవల నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌‌లో చెన్నై నుంచి బిట్రగుంట వెళ్తున్న ప్యాసింజర్ రైలు బోగీలు మంటల్లో మాడి మసికావడం వెనుక విద్రోహుల హస్తం ఉండవచ్చని ఫోరెన్సిక్ నిపుణులు ఓ ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన బోగీలను శుక్రవారం ఫోరెన్సిక్ నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించారు. 
 
ఈ పరిశీలనలో ఓ రైలు బోగీ మధ్యలో పెద్ద రంధ్రం చేసి ఉండటాన్ని వారు గుర్తించారు. దీంతో, ప్రమాదానికి కారణం షార్ట్‌ సర్క్యూట్‌ కాదని, విద్రోహ చర్యేనని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయంపై అధికారులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదంలో రెండు బోగీలు పూర్తిగా కాలిపోగా, ప్రాణనష్టం ఏమీ జరగలేదు. స్టేషన్‌ ఫ్లాట్ ఫాంకు సమీపిస్తున్న సమయంలో బోగీ నుంచి మంటలు చెలరేగిన విషయం తెల్సిందే. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments