Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసుపుమయమైన పరిటాల స్వగ్రామం... గ్రామ సభ్యులందరికీ టీడీపీ సభ్యత్వం!!

ఠాగూర్
మంగళవారం, 17 డిశెంబరు 2024 (15:21 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి దివంగత పరిటాల రవి స్వగ్రామమైన వెంకటాపురం ఇపుడు పూర్తిగా పసుపుమయమైంది. ఈ గ్రామంలోని ఓటర్లంతా టీడీపీ ప్రాథమిక సభ్యత్వం తీసుకుని సరికొత్త చరిత్ర సృష్టించారు. గ్రామంలో మొత్తం 581 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 11 మంది చనిపోయారు. మిగిలిన 570 మంది తాజాగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. 
 
దీంతో వెంకటాపురం గ్రామంలోని ఓటర్లంతా టీడీపీ ఓటర్లుగా మారిపోయారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ రికార్డు సాధించిన ఏకైక గ్రామంలో వెంకటాపురం నిలించిందని రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. 100 శాతం సభ్యత్వ నమోదు కావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తంచేశారు. 

దేశంలో పేదరికం ఎలా పోతుంది : ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి 
 
దేశంలో పేదరికం అంతరించిపోవాలంటే వారానికి 70 గంటలు చొప్పున పని చేయాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి మరోమారు అభిప్రాయపడ్డారు. భారత్.. అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరాలంటే దేశ యువత వారానికి 70 గంటలు చొప్పున పని చేయాలంటూ గతంలో ఆయన పిలుపునిచ్చారు. దీనిపై వివిధ రంగాలకు చెందిన నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. 
 
తాజాగా ఈ పని వేళల అంశంపై మరోసారి మాట్లాడిన నారాయణమూర్తి తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. వారానికి 70 గంటలు పని చేయకపోతే దేశంలో పేదరికం ఎలా అధిగమించగలమన్నారు. కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో నారాయణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఇన్ఫోసిస్‌ను మేం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ కంపెనీలతో పోలుస్తాం. 
 
అలా పోల్చుకున్నప్పుడే భారతీయులు చేయాల్సింది చాలా ఉందనిపిస్తుంది. మన దేశంలో ఇంకా 80 కోట్ల మంది ఉచిత రేషన్ అందుకుంటున్నారు. అంటే ఆ 80 కోట్ల మంది ఇంకా పేదరికంలో ఉన్నట్లే కదా..! అందుకే మన ఆశలు, ఆకాంక్షలను ఉన్నతంగా ఉంచుకోవాలి. వారానికి 70 గంటలు పని చేయలేకపోతే మనం ఈ పేదరికాన్ని ఎలా అధిగమించగలం? మనం కష్టపడి పనిచేసే స్థితిలో లేకపోతే ఇంకెవరు పనిచేస్తారు?' అని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. 
 
భవిష్యత్తు కోసం మనమంతా కలసికట్టుగా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆ మధ్య ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఎ మోహన్ దాస్ పాయ్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన 'ది రికార్డ్' అనే పాడ్కాస్ట్ తొలి ఎపిసోడ్‌లో మాట్లాడిన నారాయణ మూర్తి.. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో ఉత్పాదకత తక్కువని అన్నారు. అందుకే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ వంటి దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో.. మనమూ అలా శ్రమించాలని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments