Webdunia - Bharat's app for daily news and videos

Install App

చమన్ కుమారుడు ఉమర్‌ను ఎంబీబీఎస్ చదివిస్తా : సీఎం చంద్రబాబు హామీ

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దివంగత పరిటాల రవి ప్రధాన అనుచరుడు అనంతపురం జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ చమన్ కుమారుడు ఉమర్ ముక్తాను ఎంబీబీఎస్ చదివిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ

Webdunia
మంగళవారం, 8 మే 2018 (14:34 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దివంగత పరిటాల రవి ప్రధాన అనుచరుడు అనంతపురం జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ చమన్ కుమారుడు ఉమర్ ముక్తాను ఎంబీబీఎస్ చదివిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు చమన్ మొదటి భార్య రమీజాబీకి ఆయన హామీ ఇచ్చారు.
 
చమన్ గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. పరిటాల రవి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న చమన్ మృతిపట్ల పరిటాల అభిమానులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ పరిస్థితుల్లో చమన్ భార్య రమేజాబీతో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి ఆమెను ఓదార్చారు. చమన్ కుటుంబానికి అండగా ఉంటామని, చమన్ చిరకాలవాంఛ అయిన ఆయన కుమారుడు ఉమర్ ముక్తాను ఎంబీబీఎస్ చదివిస్తానని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. 
 
ఇదిలావుండగా, చమన్ అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం ఆయన స్వగ్రామమైన రామగిరి మండలం ఆర్. కొత్తపల్లిలో జరిగాయి. ఈ అంత్యక్రియలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, పరిటాల రవి అభిమానులు పాల్గొన్నారు. రామగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో గల చమన్ వ్యవసాయ భూమిలో అంత్యక్రియలను నిర్వహించారు. 
 
ఈ అంత్యక్రియల్లో రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, వరదాపురం సూరి, బీకే పార్థసారథి, ఎంపీ నిమ్మల కిష్టప్ప, అంత్యక్రియలకు పరిటాల రవి కుటుంబసభ్యులతో పాటు భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments