Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచాయతీ పోల్‌పై కరోనా పంజా.. ఎన్నికలు వాయిదా

Webdunia
ఆదివారం, 15 మార్చి 2020 (10:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ వైరస్ భయంతో ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే విదేశాలకు వెళ్లి వచ్చిన 6644 మందికి 14 రోజుల క్వారంటైన్ ఆదేశాలను ప్రభుత్వం జారీచేసింది. అంటే 6644 మంది తమతమ ఇళ్లనుంచి బయటకు రావడానికి వీల్లేందు. అలాగే, ఆదివారం మరో 40 లక్షల గృహాల్లో కరోనా సర్వే నిర్వహించనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ కూడా అసాధ్యంగా మారింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 
 
కరోనా ప్రభావం ఎన్నికలపైనా ఉందని, ఎలక్షన్ సమయాల్లో ప్రచారం, పోలింగ్ సందర్భంగా ప్రజలు పెద్దఎత్తున సమూహంలా చేరే అవకాశాలు ఉన్నందున ఆరు వారాల పాటు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేశ్ కుమార్ ప్రకటించారు.
 
వాస్తవానికి కరోనాతో ఎన్నికలకు ఇబ్బంది రాదని ముందు భావించామని అయితే, కేంద్రం కూడా కరోనాను జాతీయ విపత్తుగా గుర్తించిందన్న ఆయన, స్థానిక ఎన్నికలను వాయిదా వేయడానికి దారి తీసిన పరిస్థితులను వివరించారు. 
 
అత్యున్నత స్థాయి సంప్రదింపులు జరిపి, పరిస్థితులను మదింపు చేసి, ప్రభుత్వ ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత తిరిగి ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments