Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ కోళ్లఫారం యజమానిలాంటివాడు.. ఏపీ మంత్రులు పల్లె, పరిటాల

Webdunia
బుధవారం, 4 మే 2016 (08:36 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రులు పల్లె రఘునాథ రెడ్డి, పరిటాల సునీతలు మరోమారు మాటలతో దాడి చేశారు. జగన్‌ కోళ్లఫారం యజమానిలాంటివాడని.. గింజలు, నీళ్లు పోసి సాకిన తర్వాత బలి తీసుకోవడం ఆయన నైజమని వ్యాఖ్యానించారు. వైకాపాలో చివరకు జగన్‌ మినహా ఏ ఒక్కరూ మిగలరని వారు జోస్యం చెప్పారు.
 
అనంతపురంలో జరిగిన మీడియా సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ గన్‌ పార్టీ ఖాళీ అయిందని.. అందుకే ఖాళీ బిందెలు పట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను జగన్‌ నమ్మలేకపోవడం వల్లే వారు పార్టీని వీడుతున్నారన్నారు. అలాంటప్పుడు ప్రజలు ఆయనను ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. 

ఇకపోతే.. రాష్ట్రం ఎన్నో కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నా.. అపర భగీరథుడిలా సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకుని ఆయన పాలన సాగిస్తున్నారనీ తెలిపారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments