Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌రోనాతో ఆక్సీజ‌న్ విలువ తెలిసింది, అజిత్ సింగ్ న‌గ‌ర్‌లో వ‌న‌మ‌హోత్స‌వం

Webdunia
గురువారం, 5 ఆగస్టు 2021 (21:55 IST)
క‌రోనాతో అంద‌రికీ ఆక్సీజ‌న్ విలువ తెలిసొచ్చింది. భారీగా మొక్క‌లు పెంచే కార్య‌క్ర‌మాన్ని ఏపీలో ప్రారంభించారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లో వన మహోత్సవం సందర్భంగా కండ్రికలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే మల్లాది విష్ణు మొక్క‌లు నాటారు.
 
విజయవాడలో జగనన్న పచ్చ తోరణం కింద వేల మొక్కలను నాటామ‌ని, పర్యావరణం కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొనేందుకే ఈ కార్యక్రమమని మంత్రి బొత్స స‌త్య‌న్నారాయ‌ణ చెప్పారు. మొక్కలను వేసి వదిలేయడమే కాకుండా వాటి ని పెంచే బాధ్యత ఉండాల‌ని, విజయవాడ నగరాన్ని సుందరమైనదిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమ‌ని చెప్పారు.
 
ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, మొక్కలను విరివిగా నాటి పెంచి పోషించాల‌ని, కరోనాతో ఆక్సిజన్ విలువ తెలిసింద‌ని చెప్పారు. మొక్కలు పెంచడం ద్వారా ఆక్సిజన్ కొరతను అదిగమించవచ్చ‌ని, రాబోయే రోజుల్లో ఇంటింటికి మొక్క నాటే విధంగా చర్యలు తీసుకుంటామ‌న్నారు. 
 
విజ‌య‌వాడ నగరంలోని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి బొత్స హామీ ఇచ్చారు. నగరాభివృద్ధికి తోడ్పడతామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments