Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రమాదంలో చిక్కుకుని మరణంచేవరకు నరకయాతన పడ్డ నిర్భాగ్యుడు

మంచి జీవితంకోసం విదేశానికి వెళ్లి ఈ మధ్యే తిరిగొచ్చిన ఒక యువకుడు బైక్ ప్రమాదానికి గురై సహయం చేసే దిక్కులేక రాత్రంతా నరకయాతన పడి దయనీయంగా మరణించిన ఘటన అతడి బంధువులను, గ్రామస్థులను కదిలించివేస్తోంది.

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2017 (04:17 IST)
మంచి జీవితంకోసం విదేశానికి వెళ్లి ఈ మధ్యే తిరిగొచ్చిన ఒక యువకుడు బైక్ ప్రమాదానికి గురై సహయం చేసే దిక్కులేక రాత్రంతా నరకయాతన పడి దయనీయంగా మరణించిన ఘటన అతడి బంధువులను, గ్రామస్థులను కదిలించివేస్తోంది. పోలీసుల కథనం మేరకు నవుడూరు గ్రామానికి చెందిన తమ్మినీడి గణేష్  అనే యువకుడు గురువారం రాత్రి బ్రాహ్మణ చెర్వు నుంచి నవుడూరు వెళుతుండగా ప్రమాదవశాత్తూ రోడ్డు పక్కనున్న చెట్టును  మోటారా సైకిలుతో ఢీకొట్టాడు.
 
ఆ యువకుడికి ఇంకా పెళ్లికాలేదు. 30 ఏళ్ల వయస్సు. కొద్ది రోజుల క్రితమే  విదేశాలనుంచి దేశానికి తిరిగి వచ్చాడు. దురదృష్టం ఏమిటంటే రాత్రి పూట ప్రమాదం జరగడంతో తీవ్ర గాయాల పాలై స్పృహ తప్బిన గణేష్‌ను ఎవరూ గమనించలేక పోయారు. దీంతో గాయాలతో బాధపడి బాధపడి తెల్లారేసరికి ఘటనా స్థలంలో మృతి చెందాడు. విదేశాల నుంచి తిరిగి వచ్చి అర్ధాంతరంగా రోడ్డు ప్రమాదంలో దిక్కులేని చావు పొందిన గణేష్‌ను చూసి ఊరంతా కన్నీళ్లు పెట్టుకుంది.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

'హరి హర వీరమల్లు'తో పాన్ ఇండియా విజయాన్ని అందుకుంటాం : నిర్మాత ఏ.ఎం.రత్నం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

తర్వాతి కథనం
Show comments