Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఇంగ్లీష్ మీడియంపై సుప్రీంకోర్టులో వ్యతిరేకత తప్పదు: రఘురామకృష్ణరాజు

Webdunia
శుక్రవారం, 30 అక్టోబరు 2020 (17:40 IST)
వైసీపీ ప్రభుత్వం ఏపీలోని ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాలని పలు సన్నహాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై అనేకమంది తెలుగు భాషాభిమానులు, విద్యార్థుల తల్లిదండ్రులు రాత పూర్వక వ్యతిరేకతను తెలిపారు. కొందరు కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి విమర్శలు గుప్పించారు.
 
స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించలేమని చెబుతున్న ప్రభుత్వం మరోవైపు పాఠశాలలను ప్రారంభించేందుకు సిద్ధమైందని మండిపడ్డారు. విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టవద్దని కోరారు. కరోనా తగ్గిన తర్వాతే పాఠశాలలను ప్రారంభించాలని తెలిపారు. ఈ విషయంలో జగన్ తన ఆవేశాన్ని తగ్గించి ఆలోచన చేయాలని తెలిపారు.
 
మరోవైపు ఏపీ విద్యాశాఖ మంత్రికి రఘురామ లేఖ రాశారు. ఇంగ్లీష్ మీడియంపై సుప్రీంకోర్టులో కచ్చితంగా వ్యతిరేకత వస్తుందని తెలిపారు. సుప్రీంకోర్టులో స్టే రాకపోతే హైకోర్టు ఉత్తర్వులను పాటించాలని తెలిపారు. ఏ మీడియంలో విద్యాబోధన ప్రారంభించబోతారో ముందుగా చెప్పాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments