Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు మార్కెట్లో కుప్పలుతెప్పలుగా ఉల్లి, రైతు ధర కిలో రూ. 15, ప్రజలకు రూ. 50

ఐవీఆర్
బుధవారం, 30 అక్టోబరు 2024 (17:43 IST)
కర్నూలు మార్కెట్లోకి ఉల్లిపాయలు కుప్పలుతెప్పలుగా వచ్చి చేరుతున్నాయి. ఉల్లి కొనుగోలు చేసిన వ్యాపారులు వాటిని తరలించడంలో జాప్యం చేస్తున్నారు. ఉల్లిని ఎగుమతి చేసుకునేందుకు తమకు లారీలు దొరకడంలేదని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు మార్కెట్టుకి రైతులు తమ ఉల్లి దిగుబడితో భారీ సంఖ్యలో వస్తున్నారు. ఇదే అదనుగా దళారులు రైతుల జేబులకు చిల్లులు పెట్టే పని ప్రారంభించారు. రైతుల నిస్సహాతను ఆసరాగా చేసుకుని రైతులకి కిలోకి రూ. 15కే దోచేస్తున్నారు.
 
ఇదంతా అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉల్లిని విక్రయించుకునేందుకు మార్కెట్టుకి వచ్చిన రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. దీనితో ఉల్లిపాయల్లో తరుగు కింద క్వింటాళ్ల లెక్కన పోతోంది. ఈ తలనొప్పి భరించలేని రైతులు అయినకాడికి అమ్ముకుని వెళ్లిపోతున్నారు. రైతుల నుంచి కిలో ఉల్లిపాయలను రూ. 15కి కొంటుండగా అవి వినియోగదారుడికి చేరేసరికి కిలోకి రూ. 50 అవుతోంది. ఇంత భారీ అంతరం కళ్లకు కట్టినట్లు కనబడుతున్నా అధికారులు పట్టిపట్టనట్లు వ్యవహరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments