Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి!!

వరుణ్
బుధవారం, 27 మార్చి 2024 (16:23 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బుధవారం కలుసుకున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవతో కలిసి వచ్చి మర్యాదపూర్వకంగా పవన్‌ను కలుసుకున్నారు. పవన్‌త ఆయన పలు అంశాలపై చర్చించారు. వీరి వెంట ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ కూడా ఉన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇటీవల వైకాపాకు రాజీనామా చేసి టీడీపీలో చేరిన విషయం తెల్సిందే. 
 
అలాగే, తిరుపతి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ కూడా (గూడూరు సిట్టింగ్ ఎమ్మెల్యే) పవన్ కళ్యాణ్‌తో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, పొత్తు నేపథ్యంలో సమన్వయం, ఓట్ల బదిలీ తదితర అంశాలపై వారు చర్చించినట్టు తెలుస్తుంది. గత ఎన్నికల్లో వైకాపా తరపున గూడూరు అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన వరప్రసాద్ కొన్ని రోజుల కిందటే వైకాపాకు రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెల్సిందే. ఈయనకు బీజేపీ అధిష్టానం తిరుపతి ఎంపీ టిక్కెట్‌ను కేటాయించింది. 

మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను ప్రారంభించిన సీఎం జగన్ 
 
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బుధవారం నుంచి 21 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్ర కడప జిల్లా ఇడుపులపాయ నుంచి బయలుదేరింది. వైఎస్ఆర్ ఘాట్‌కు తన తల్లి విజయమ్మతో కలిసి నివాళులు అర్పించిన జగన్... ఆ తర్వాత బస్సు యాత్రను ప్రారంభించారు. తొలి రోజు రాత్రికి ఆయన నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డలో బస చేస్తారు. 
 
తొలిరోజు బస్సు యాత్ర ఇడుపులపాయ, వేంపల్లి, వీరపునాయుని పల్లి, ఉరుటూరు, సున్నపురాళ్లపల్లి, ప్రొద్దుటూరు, యర్రగుంట్ల, దువ్వూరు, చాగలమర్రి, ఆళ్ళగడ్డ వరకు సాగుతుంది. అంతకుముందు తన తండ్రి వైఎస్ఆర్ ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఇందులో తన తల్లి విజయమ్మ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్‌కు తల్లి విజయమ్మ ముద్దుపెట్టి, ఆశీర్వదించి యాత్రకు సాగనంపారు. యాత్రకోసం సిద్ధంగా ఉన్న బస్సులోకి జగన్, వైఎస్ అవినాశ్ రెడ్డి, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, కడప జిల్లా నేతలు ఎక్కారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments