Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుకుంటే ఎంతసేపు.. తాడేపల్లి ప్యాలెస్‌ను కూల్చడానికి ఒక్క నిమిషం చాలు..!

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2023 (21:35 IST)
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో లేదా అంతకంటే ముందుగా ఎన్నికలు జరిగినా విజయం తెలుగుదేశం పార్టీకేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ యూనియన్‌ నేతలతో సమావేశమయ్యారు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలను వేధింపులకు గురిచేస్తోందని, వారిపై తప్పుడు కేసులు పెట్టిందని చంద్రబాబు విమర్శించారు. 
 
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఏపీ సర్కారును చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు. అనుకుంటే తాడేపల్లి ప్యాలెస్‌ను ఒక్క నిమిషంలోపే కూల్చివేయవచ్చని చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి చేదు గుణపాఠమని పేర్కొన్నారు.
 
ప్రతిపక్షాల నుంచి టీడీపీని తరిమికొట్టాలన్న సీఎం జగన్ ప్లాన్ కేవలం కల మాత్రమేనని, అది నెరవేరదని చంద్రబాబు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలు వైఎస్సార్‌సీపీని ఇంటికి పంపిస్తారని ఆయన జోస్యం చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని టీడీపీ అధినేత ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments