Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో దారుణం: బంగారం కోసం వృద్ధురాలి హత్య

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (10:11 IST)
విజయవాడ నగరంలోని శివారు ప్రాంతంలో దారుణం జరిగింది. బంగారు నగలు కోసం ఓ వృద్ధురాలిని దుండగులు కర్రలతో కొట్టి చంపేసారు. ఈ దారుణ ఘటన కుందావారి కండ్రిగ ప్రాంతంలో చోటుచేసుకుంది.
 
పూర్తి వివరాలను చూస్తే.. భర్త, పెద్ద కుమారుడు చనిపోవడంతో సుబ్బమ్మ అనే వృద్ధురాలు స్థానిక సిండికేట్‌ బ్యాంకు సమీపంలో ఒంటరిగా వుంటుంది. పక్క పోర్షనుని అద్దెకి ఇచ్చింది. ఐతే గురువారం నాడు సాయంత్రం అద్దె ఇంటివారు బయటకు వెళ్లారు. ఈ సమయంలో ఓ దుండగుడు మోటార్ వాహనంపై వచ్చి ఇంటిలో చొరబడ్డాడు.
 
వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో పక్కనే వున్న ఇనుప రాడ్డు, రోకలి బండ తీసుకుని తలపై మోదాడు. దాంతో ఆమె కుప్పకూలిపోయింది. నగలు తీసుకుని పారిపోయాడు. రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అద్దెకున్నవారు చూస్తే వృద్ధురాలు రక్తపు మడుగులో పడి వుంది. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments