Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో దారుణం: బంగారం కోసం వృద్ధురాలి హత్య

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (10:11 IST)
విజయవాడ నగరంలోని శివారు ప్రాంతంలో దారుణం జరిగింది. బంగారు నగలు కోసం ఓ వృద్ధురాలిని దుండగులు కర్రలతో కొట్టి చంపేసారు. ఈ దారుణ ఘటన కుందావారి కండ్రిగ ప్రాంతంలో చోటుచేసుకుంది.
 
పూర్తి వివరాలను చూస్తే.. భర్త, పెద్ద కుమారుడు చనిపోవడంతో సుబ్బమ్మ అనే వృద్ధురాలు స్థానిక సిండికేట్‌ బ్యాంకు సమీపంలో ఒంటరిగా వుంటుంది. పక్క పోర్షనుని అద్దెకి ఇచ్చింది. ఐతే గురువారం నాడు సాయంత్రం అద్దె ఇంటివారు బయటకు వెళ్లారు. ఈ సమయంలో ఓ దుండగుడు మోటార్ వాహనంపై వచ్చి ఇంటిలో చొరబడ్డాడు.
 
వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో పక్కనే వున్న ఇనుప రాడ్డు, రోకలి బండ తీసుకుని తలపై మోదాడు. దాంతో ఆమె కుప్పకూలిపోయింది. నగలు తీసుకుని పారిపోయాడు. రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అద్దెకున్నవారు చూస్తే వృద్ధురాలు రక్తపు మడుగులో పడి వుంది. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments