Webdunia - Bharat's app for daily news and videos

Install App

పింఛన్ అడిగిన పాపానికి ముదుసలి చెంప వాచింది!

Webdunia
శుక్రవారం, 23 జనవరి 2015 (10:41 IST)
పింఛన్ అడిగిన పాపానికి ఓ ముదుసలి చెంప వాచిన ఘటన నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. ఆమె ఓ పండు ముదుసలి. ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పింఛన్‌తో నిశ్చింతగా జీవించొచ్చని భావించింది. 
 
అయితే ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో ఆమె పేరు లేదు. దీంతో స్థానిక ప్రజాప్రతినిధిని ఆశ్రయిస్తే, పింఛన్ అందకపోతుందా, అనుకున్న ఆమెకు ఊహించని విధంగా చెంపదెబ్బ తగిలింది. 
 
వివరాల్లోకెళితే... పట్టణంలోని 21వ వార్డుకు చెందిన వృద్ధురాలు లక్ష్మి, పింఛన్ ఇప్పించాలని తమ వార్డు కౌన్సిలర్‌గా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేత నర్సింలును వేడుకుంది. ముసలమ్మకు సాయం చేయాల్సిన నర్సింలు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయాడు. 
 
వృద్ధురాలి చెంప చెళ్లుమనిపించాడు. దీంతో ఆసరా కోసమొస్తే, చెంపదెబ్బ తగిలిందని రోదించిన లక్ష్మి పోలీస్ స్టేషన్లో నర్సింలుపై ఫిర్యాదు చేసింది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments