Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లి కోసం పాట్లు : క్యూలో నిల్చోలేక ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడు

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (11:35 IST)
దేశవ్యాప్తంగా ఉల్లి పాట్లు ఇప్పట్లో తీరేలా లేదు. ఉల్లిపాయల కోసం జరుగుతున్న పోరాటంలో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా నవ్యాంధ్రలో ఈ ఘటనల ఎక్కువగా జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న కర్నూలు జిల్లాలో సబ్సీడీ ఉల్లిపాయల కోసం తొక్కిసలాట జరిగింది. ఇపుడు కృష్ణా జిల్లా గుడివాడలో ఉల్లి కోసం క్యూలో నిలబడిన ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, ఉల్లి కోసం క్యూలో నిల్చున్న ఓ వృద్ధుడు టెన్షన్‌ తట్టుకోలేక గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఉల్లి ధర ఆకాశయానంతో ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా సబ్సిడీ ఉల్లి పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. 
 
కృష్ణా జిల్లా గుడివాడ రైతు బజార్‌లో సోమవారం ఉదయం ఉల్లి అమ్మకాలు జరుగుతుండటంతో సాంబయ్య అనే వృద్ధుడు క్యూలో నిల్చున్నాడు. ఉదయం నుంచి క్యూలో నిల్చోవడం, ఉల్లి దొరుకుతుందో లేదో అన్న ఆందోళనకు గురికావడంతో కొన్ని గంటల తర్వాత క్యూలోనే కుప్పకూలిపోయాడు. 
 
అలా స్పృహతప్పి పడిపోయిన అతన్ని హుటాహుటిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆ వృద్ధుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments