Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోనసీమ జిల్లాలో దళిత బాలికకు అవమానం - చికిత్స కోసం వెళితో కాలితో తొక్కి...

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2023 (10:20 IST)
ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. దళిత బాలికకు ఘోర అవమానం జరిగింది. చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ దళిత బాలికను నర్సు కాలితో తొక్కి పరీక్షిస్తూ అవమానించింది. ఈ ఘటన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని కాట్రేనికోనకు చెందిన నేలపాటి భాస్కర రావు తన పదేళ్ల మనవరాలు కాలినొప్పితో బాధపడుతుంటే ఆదివారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. అయితే, అక్కడున్న నర్సు మణికుమారి మాత్రం చిన్నారి కాలును తన కాలితో తొక్కి పరీక్షించింది. పైగా, చికిత్స ఏమీ చేయకుండానే అమలాపురం ఆస్పత్రికి తీసుకెళ్లాని సూచించింది. 
 
దీంతో నర్సుపై భాస్కర రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగిని అవమానించినందుకు పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. దీంతో నర్సు క్షమాపణ చెప్పింది. కాగా, సదరు నర్సు డిప్యుటేషన్‌పై తమ ఆస్పత్రిలోనే పని చేస్తుందని వైద్యురాలు నిఖిత తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూస్తానని ఆమె హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments