Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోనసీమ జిల్లాలో దళిత బాలికకు అవమానం - చికిత్స కోసం వెళితో కాలితో తొక్కి...

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2023 (10:20 IST)
ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. దళిత బాలికకు ఘోర అవమానం జరిగింది. చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ దళిత బాలికను నర్సు కాలితో తొక్కి పరీక్షిస్తూ అవమానించింది. ఈ ఘటన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని కాట్రేనికోనకు చెందిన నేలపాటి భాస్కర రావు తన పదేళ్ల మనవరాలు కాలినొప్పితో బాధపడుతుంటే ఆదివారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. అయితే, అక్కడున్న నర్సు మణికుమారి మాత్రం చిన్నారి కాలును తన కాలితో తొక్కి పరీక్షించింది. పైగా, చికిత్స ఏమీ చేయకుండానే అమలాపురం ఆస్పత్రికి తీసుకెళ్లాని సూచించింది. 
 
దీంతో నర్సుపై భాస్కర రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగిని అవమానించినందుకు పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. దీంతో నర్సు క్షమాపణ చెప్పింది. కాగా, సదరు నర్సు డిప్యుటేషన్‌పై తమ ఆస్పత్రిలోనే పని చేస్తుందని వైద్యురాలు నిఖిత తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూస్తానని ఆమె హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments