Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంచికచర్ల వద్ద రోడ్డు ప్రమాదం - 15 మందికి గాయాలు

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (08:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా 15 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
విశాఖపట్టణం నుంచి హైదరాబాద్ నగరానికి వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న లారీని తప్పించే ప్రయత్నంలో రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తాపడింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. 
 
ఈ బస్సు ప్రమాదం జరిగిన సమయంలో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్‌కు కోర్టులో చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ కొట్టివేత

పీరియాడిక్ కథతో కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపిన చిత్రమే క: హీరో కిరణ్ అబ్బవరం

పొట్టేల్ నుంచి పటేల్ గా అజయ్ పవర్ ఫుల్ లుక్ రిలీజ్

మహేష్ బాబు పచ్చిగొల్ల దర్శకత్వంలో ఉస్తాద్ రామ్ పోతినేని చిత్రం

ప్రియదర్శితో సారంగపాణి జాతకం చెప్పబోతున్న మోహనకృష్ణ ఇంద్రగంటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డార్క్ చాక్లెట్ తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందా?

ఐరన్ లోపం వున్నవాళ్లు ఈ పదార్థాలు తింటే ఎంతో మేలు, ఏంటవి?

మధుమేహం-సంబంధిత దృష్టి నష్టాన్ని నివారించే లక్ష్యంతో డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్

ఖాళీ కడుపుతో లవంగాలను నమిలితే?

పోషకాల గని సీతాఫలం తింటే ఈ వ్యాధులన్నీ దూరం

తర్వాతి కథనం
Show comments