Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీలో చేరిన ఇద్దరు వైకాపా కౌన్సిలర్లు

ఠాగూర్
సోమవారం, 18 మార్చి 2024 (13:42 IST)
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అధికార వైకాపాకు చెందిన ఇద్దరు కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు మే నెల 13వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. అదేసమయంలో అధికార వైకాపాకు చెందిన అనేక మంది ప్రజాప్రతినిధులు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ వైకాపాను వీడి టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీల్లో చేరిన విషయం తెల్సిందే. 
 
ఇందులోభాగంగా, తాజాగా అధికార పార్టీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ ఇద్దరు కార్పొరేటర్లు టీడీపీ నేతలు కేశినేని శివనాథ్, తంగిరాల సౌమ్య సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. వీరితో పాటు మరికొందరు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరోమారు అధికారంలోకి రావాలని భావిస్తున్న అధికార వైకాపాకు చెందిన అనేక మంది ప్రజాప్రతినిధులు గుట్టుచప్పుడు కాకుండా ఇతర పార్టీల్లోకి చేరిపోతుండటం ఆ పార్టీ అధిష్టానాన్ని కలవరపాటుకు గురిచేస్తుంది. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments