Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీలో చేరిన ఇద్దరు వైకాపా కౌన్సిలర్లు

ఠాగూర్
సోమవారం, 18 మార్చి 2024 (13:42 IST)
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అధికార వైకాపాకు చెందిన ఇద్దరు కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు మే నెల 13వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. అదేసమయంలో అధికార వైకాపాకు చెందిన అనేక మంది ప్రజాప్రతినిధులు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ వైకాపాను వీడి టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీల్లో చేరిన విషయం తెల్సిందే. 
 
ఇందులోభాగంగా, తాజాగా అధికార పార్టీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ ఇద్దరు కార్పొరేటర్లు టీడీపీ నేతలు కేశినేని శివనాథ్, తంగిరాల సౌమ్య సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. వీరితో పాటు మరికొందరు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరోమారు అధికారంలోకి రావాలని భావిస్తున్న అధికార వైకాపాకు చెందిన అనేక మంది ప్రజాప్రతినిధులు గుట్టుచప్పుడు కాకుండా ఇతర పార్టీల్లోకి చేరిపోతుండటం ఆ పార్టీ అధిష్టానాన్ని కలవరపాటుకు గురిచేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments