Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్.టి.ఆర్ ఆశీస్సులు జగన్ మోహన్ రెడ్డికి ఉంటాయా?

Webdunia
మంగళవారం, 28 మే 2019 (14:19 IST)
నేడు తెలుగుదేశం పార్టీ వ్వవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు 97వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్.టి.ఆర్ ఘాట్లో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు లక్ష్మీ పార్వతి, మోత్కుపల్లి నర్సింహలు, పలువురు తెలుగుదేశం నేతలు నివాళులు అర్పించారు. 
 
అనంతరం మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టిన ఘనత ఎన్.టి.రామారావుదని, అటువంటి మహానేతను చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని, తద్వారా ఎన్టీఆర్ హింసకు గురై మరణించాడని అన్నారు. ఎన్టీఆర్ పడిన ఆత్మఘోష ఈరోజు నెరవేరిందని తెలియజేశారు. చంద్రబాబు ఓడిపోవడం వల్ల ఎన్టీఆర్ ఆత్మ శాంతించిందని, కేవలం చంద్రబాబు నాయకత్వం వల్లే ఏపీలో టీడీపీ ఓటమి పాలయ్యందన్నారు.
 
తెలుగుదేశం జెండా చంద్రబాబునాయుడిది కాదని, నందమూరి కుటుంబ సభ్యులకు మాత్రమే చెందుతుందన్నారు. టీడీపీ అధ్యక్ష పదవికి చంద్రబాబు రాజీనామా చేసి నందమూరి కుటుంబ సభ్యులకు అప్పగించాలన్నారు. జగన్ నాయకత్వంలో ఏపీ అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని, అన్న ఎన్టీఆర్ ఆశీస్సులు జగన్ మోహన్ రెడ్డికి తప్పకుండా ఉంటాయన్నారు. తాజాగా మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలతో ఎన్.టి.ఆర్ ఆశీస్సులు జగన్‌కు ఎందుకుంటాయని విమర్శిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments