Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి రాజంపాలెంలో గుడి.. కట్టించేదెవరంటే?

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (09:43 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆలయం నిర్మించేందుకు కట్టేందుకు ఆయన అభిమానులు కొందరు సిద్ధమయ్యారు. పాలక పార్టీ ఎమ్మెల్యే దీనికి శంకుస్థాపన చేశారు. గుడి నిర్మాణానికి శంకుస్థాపన జరగడంతో పనులు ప్రారంభించారు. 
 
ఆగస్ట్ 15లోగా గుడి పూర్తవుతుందని కూడా ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని రాజంపాలెంలో ఆగస్ట్ 5న సీఎం జగన్‌కు కడుతున్న గుడికి శంకుస్థాపన చేశారు స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకటరావు. వైసీపీ నాయకుడు కరుకూరి నాగేశ్వర రావు ఆధ్వర్యంలో ఈ గుడి నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. 
 
సుమారు రూ.10 లక్షల వ్యయంతో గుడి నిర్మిస్తామని ప్రకటించారు. 10 సెంట్లు స్థలంలో గుడి కడుతున్నామని తెలిపారు. అయితే ముఖ్యమంత్రి పేరుతో గుడి కడుతుండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో పాలక వైసీపీ అది తమ పార్టీ వైఖరి కాదని చెబుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments