Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌కు హైకోర్టులో చుక్కెదురు.. క్వాష్ పిటిషన్ కొట్టివేత.. ప్రాథమిక ఆధారాలున్నాయ్..

వైసీపీ అధినేత జగన్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. కృష్ణా జిల్లా నందిగామలో అధికారులపట్ల దురుసుగా ప్రవర్తించిన ఘటనపై జగన్‌పై నందిగామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే ఈ కేసును కొట్టివేయవలసిందిగా ఆయన క

Webdunia
మంగళవారం, 13 జూన్ 2017 (15:41 IST)
వైసీపీ అధినేత జగన్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. కృష్ణా జిల్లా నందిగామలో అధికారులపట్ల దురుసుగా ప్రవర్తించిన ఘటనపై జగన్‌పై నందిగామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే ఈ కేసును కొట్టివేయవలసిందిగా ఆయన కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యాయస్థానం కేసు కొట్టివేతకు నిరాకరిస్తూ క్వాష్ పిటిషన్‌ని తిరస్కరించింది.
 
ఇంకా కలెక్టర్ల పట్ల జగన్ దురుసుగా ప్రవర్తించారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నందున ఈ పిటిషన్ కొట్టివేసేందుకు నిరాకరిస్తున్నట్లు కోర్టు తెలిపింది. కేసును ఎదుర్కోవాల్సిందేనని వెల్లడించింది. కృష్ణా జిల్లా నందిగామ వద్ద ఓ ప్రైవేటు బస్సు ప్రమాదం జరిగిన తరువాత, అక్కడికి వెళ్లిన జగన్ ఆసుపత్రిలో కలెక్టర్, వైద్యులపై దురుసుగా ప్రవర్తించినట్టు జగన్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
 
నందిగామ ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలను పరిశీలించడానికి జగన్ వెళ్లగా.. పోస్టు మార్టమ్ రిపోర్టుపై కలెక్టర్‌తో వాగ్వాదం జరిగింది. ప్రమాదంలో చనిపోయిన బస్సు డ్రైవర్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేయకుండా తరలిస్తుండటాన్ని ఈ సందర్భంగా జగన్ ప్రశ్నించారు. 
 
ఇదే క్రమంలో ఆ మృతదేహానికి సంబంధించిన పేపర్లను డాక్టర్ వద్ద నుంచి లాక్కున్నారన్న ఆరోపణలున్నాయి. మొత్తం మీద ఓ కలెక్టర్ పట్ల, డాక్టర్ పట్ల జగన్ అలా వ్యవహరించడంపై అప్పట్లో అధికార పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments