పాపికొండల విహార యాత్ర రద్దు.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2023 (09:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన పాపికొండల పడవ ప్రయాణ విహారయాత్రను రెండు రోజుల పాటు తాత్కాలికంగా రద్దు చేశారు. దీనికి కారణం ఏపీ రాష్ట్రంలో ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోవడమే. ఈ కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అకాల వర్షాలకుతోడు ఈదురు గాలులు కూడా వీస్తుండటంతో పాపికొండల యాత్రను సోమ, మంగళవారాల్లో రద్దు చేశారు. వాతావరణం అనుకూలించిన తర్వాత మళ్లీ యాత్రను పునరుద్ధరిస్తామని పోశమ్మగుడి కంట్రోల్ రూమ్ మేనేజర్ రజిత్ తెలిపారు. 
 
కాగా, సముద్రంపై ఆవరించివున్న ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగానే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఒకసారి, సాయంత్రం 6.30 గంటల సమయంలో రెండోసారి వర్షం కురిసింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ అకాల వర్షం కారణంగా తిరుమాఢ వీధులన్నీ జలమయమయ్యాయి. పలు షాపింగ్ కాంప్లెక్స్‍‌లలోకి నీరు ప్రవేశించింది. దీంతో భక్తులు షెడ్ల కింద తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments