Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు మ‌ర‌మ్మ‌తు చేసిన నూజివీడు పోలీసులు

Webdunia
గురువారం, 29 జులై 2021 (16:13 IST)
ఎక్క‌డైనా యాక్సిడెంట్ జ‌రిగితే... పోలీసులు హుటాహుటిన వ‌స్తారు... ఏ వాహ‌నానిది త‌ప్పో ఎంచి కేసులు
రాసుకుంటారు. డ్రైవ‌ర్ల‌ను అరెస్టు చేస్తారు. ఇదీ పోలీసులు డ్యూటీ... మ‌హా అయితే, మాన‌వతా దృక్ప‌థంతో యాక్సిడెంట్లో క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లిస్తారు. 
 
కానీ నూజివీడు పోలీసులు మాత్రం మాన‌వ‌త్వంలో మ‌రో అడుగు ముందుకు వేశారు. యాక్సిడెంట్ జ‌రిగిన స్పాట్లో త‌మ విధుల‌న్నీ పూర్తి చేయ‌డ‌మే కాకుండా, తిరిగి అక్క‌డ యాక్సిడెంట్ జ‌ర‌గ‌కుండా... రోడ్డును కూడా మ‌ర‌మ్మ‌తు చేశారు.
 
కృష్ణాజిల్లా నూజివీడు రహదారిలో యాక్సిడెంట్ అయింది. 
 
ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు వేగంగా వచ్చి ఢీకొన్నాయి. ఆ ప్రమాదానికి సంబంధించి డ‌య‌ల్ 100 కు కాల్ రాగా, వెంటనే నూజివీడు ఎస్సై రామకృష్ణ సిబ్బందితో కలిసి ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అక్క‌డ గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. 
 
లోడుతో వెళ్తున్న లారీలోని సరుకు రహదారిపై అస్తవ్యస్తంగా పడడంతో, వెంటనే ఎస్ఐ, సిబ్బంది లారీలను పక్కకు జరిపి రహదారిపై ఉన్న వస్తువులను శుభ్రం చేయించారు. అంతేకాదు... ఇంకొకసారి ఆ ప్రాంతంలో ప్రమాదం జరగకూడదని ఏకంగా రోడ్డును మ‌ర‌మ్మ‌తు చేశారు. ప్ర‌మాదం జ‌రిగిన చోట‌ రేడియం స్టిక్కర్లు కలిగిన డ్రమ్ములను అమర్చారు. రోడ్డును పూర్తిగా వేసి, మ‌ర‌మ్మ‌తు పూర్త‌య్యాక ఈ డ్ర‌మ్ముల‌ను తొలగిస్తామ‌ని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments