Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఉక్కు అమ్మే హ‌క్కు ఏ ప్ర‌భుత్వానికీ లేదు: మేధా పాట్క‌ర్

Webdunia
శనివారం, 30 అక్టోబరు 2021 (10:55 IST)
విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని అమ్మే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదని పర్యావరణ ఉద్యమకారిణి  మేధా పాట్కర్ అన్నారు. శనివారం స్ట్రీల్ ప్లాంటు ప్రవేటీకరణ వ్యతిరేకంగా కూర్శన్నపాలెం దగ్గర కార్మికులు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు పర్యావరణ ఉద్యమకారిణి మేధాపాట్కర్, ఐఎఫ్‌టీయూ జాతీయ అధ్యక్షులు డాక్టర్ అపర్ణ సంఘీభావం పలికారు. 
 
 
ఈ సందర్భంగా మేధాపాట్కర్ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వరంగ సంస్థల ప్రవేటీకరణతో దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశాన్ని ప్రజలే నిర్మించుకున్నారని, ఇందులో నేత‌లు, పార్టీల ప్ర‌మేయం లేద‌ని చెప్పారు. మోదీ ప్రభుత్వం దేశాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో  పెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. ప్రజలు, కార్మికులు, రైతులు ఉద్యమం చేసే సమయం ఆసన్నమైందని మేధాపాట్కర్ తెలిపారు. 
 
 
ఎట్టి ప‌రిస్థితుల్లో విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని అమ్మ‌నీయ కూడ‌ద‌ని, మోదీ స‌ర్కారుకు ఈ విశాఖ స్టీల్స్ సాక్షిగా బుద్ధి చెప్పాల‌ని సూచించారు. కార్మికుల ఉద్యామానికి తాము పూర్తి మ‌ద్ద‌తు తెలుపుతున్న‌ట్లు పర్యావరణ ఉద్యమకారిణి మేధాపాట్కర్, ఐఎఫ్‌టీయూ జాతీయ అధ్యక్షులు డాక్టర్ అపర్ణ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments