Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరాయి మగాడితో పడకసుఖం.. భర్తను చంపి ఇసుకలో పాతిపెట్టిన భార్య!

Webdunia
మంగళవారం, 12 మే 2020 (16:36 IST)
ఆ మహిళ పక్కింటి పురుషునితో పడక సుఖం గుట్టుచప్పుడు కాకుండా పొందుతూ వచ్చింది. అది ఓ రోజున కట్టుకున్న భర్త కళ్ళారా చూశాడు. అప్పటి నుంచి భార్యను వేధించసాగాడు. దీంతో విసిగిపోయిన ఆ మహిళ.. చివరకు ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది. ఆ తర్వాత భర్త శవాన్ని ఇసుకలో పాతిపెట్టింది. తర్వాత తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దారుణం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బోధన్‌ మండలం మందార్నలో నివాసముంటున్న గంగామణి అనే మహిళకు సాయిరాం అనే వ్యక్తితో కొన్నేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ళ పాప కూడా ఉంది. అయితే, గంగామణికి అదే గ్రామానికి చెందిన సుభాష్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఓ రోజున వీరిద్దరూ భర్త సాయిరాం కంట్లోపడ్డారు. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు చెలరేగాయి. పైగా, భార్యను నిర్బంధించసాగాడు. 
 
దీంతో విసిగిపోయిన గంగామణి, తన ప్రియుడి సాయంతో హత్య చేసేందుకు ప్లాన్ వేసింది. శుక్రవారం తప్ప తాగి ఇంటికి వచ్చిన భర్త సాయిరాంను తన ప్రియుడు సుభాష్‌, గంగామణి తండ్రి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి తీవ్రంగా కొట్టి హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని గ్రామ శివారులోని మంజీర నదిలో పాతిపెట్టారు. 
 
ఆ తర్వాత తన భర్త మూడు రోజులుగా కనిపించడం లేదని బోరున విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో అసలు విషయం వెలుగు చూసింది. మృతదేహాన్ని సోమవారం రూరల్‌ పోలీసులు బయటకు తీసి పోస్టుమార్టానికి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments