Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవర్నరును కలువనున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్

Webdunia
గురువారం, 11 జూన్ 2020 (14:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ త్వరలోనే ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌తో సమావేశంకానున్నట్టు తెలుస్తోంది. ఆ సమయంలో ఆయన తనను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించాలని కోరే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. 
 
కాగా, ఎస్ఈసీ నుంచి నిమ్మగడ్డను తొలగించేందుకు ఏపీ సర్కారు ప్రత్యేకంగా ఓ ఆర్డినెన్స్ తెచ్చింది. దీన్ని హైకోర్టు కొట్టివేసింది. పైగా, రాష్ట్ర ఎన్నికల కమిషనరుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తిరిగి పునర్నియమించాలని సూచన చేసింది. కానీ, ఏపీ సర్కారు మాత్రం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. అక్కడ కూడా ఏపీ సర్కారుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలాడొద్దంటూ హితవు పలికింది. 
 
ఈ నేపథ్యంలో గవర్నర్ హరిచందన్‌తో సమావేశం కావాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయించారు. పైగా, ఈ సందర్భంగా ఆయన తనను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనరుగా నియమించాలని కోరనున్నట్టు సమాచారం. ఎందుకంటే. రాజ్యాంగబద్ధమైన నియామకాలను గవర్నరు చేపడుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments