Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిరుదులపై మత్తు ఇంజెక్షన్ వేసి బ్యూటీషియన్ పద్మపై హత్యాయత్నం ... నిదింతుడూ సూసైడ్

రాజమండ్రి జంక్షన్ సెంటర్‌లో బ్యూటీషియన్‌ పద్మ హత్యాయత్నం కేసులో కొత్తకోణాలు వెలుగు చూశాయి. హత్యాయత్నానికి గురైన పిల్లి పద్మకు మత్తు ఇంజక్షన్‌ ఇచ్చినట్లు నిర్ధరణ అయింది. నిందితుడు నూతన్‌ కుమార్‌ కోసం ప

Webdunia
సోమవారం, 27 ఆగస్టు 2018 (08:42 IST)
రాజమండ్రి జంక్షన్ సెంటర్‌లో బ్యూటీషియన్‌ పద్మ హత్యాయత్నం కేసులో కొత్తకోణాలు వెలుగు చూశాయి. హత్యాయత్నానికి గురైన పిల్లి పద్మకు మత్తు ఇంజక్షన్‌ ఇచ్చినట్లు నిర్ధరణ అయింది. నిందితుడు నూతన్‌ కుమార్‌ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. రెండు రోజుల క్రితం నూతన్‌ కుమార్‌తో పద్మగొడవపడినట్లు సమాచారం. వివాహేతర సంబంధం వికటించడం వల్లే హత్యాయత్నం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
 
రాజమహేంద్రవరానికి చెందిన పల్లె పద్మ, హనుమాన్‌ జంక్షన్‌ ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ఓ బ్యూటీ పార్లర్‌లో పని చేస్తోంది. కుటుంబకలహాలతో భర్త సూర్యనారాయణతో వేరుగా ఉంటుంది. ఏలూరుకు చెందిన బత్తుల నూతన్‌కుమార్‌తో తారకరామ కాలనీలో కొంతకాలంగా సహజీవనం చేస్తోంది. 
 
వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో నూతన్‌ కుమార్‌, పద్మకు మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి కాళ్లూ, చేతులూ కట్టేసి కత్తితో రెండు చేతులూ నరికేసి హింసించినట్లు తెలుస్తోంది. అనంతరం నూతన్‌ కుమార్‌ పరారయ్యాడు. దీంతో నూతన్ కుమార్ కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. 
 
ఈ నేపథ్యంలో పద్మ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న నూతన్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్యూటీషియన్‌పై లైంగిక దాడి, హత్య చేసిన తర్వాత పరారైన నూతన్‌ కుమార్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు-నరసరావు పేట మధ్య రైలు పట్టాలపై ఆదివారం సాయంత్రం నూతన్‌ మృతదేహం లభించింది. నూతన్‌ కోసం నాలుగు పోలీస్‌ బృందాలు గాలింపు చర్యలు ఆరంభించిన నేపథ్యంలో అతను ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం