Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?

ఠాగూర్
సోమవారం, 2 డిశెంబరు 2024 (20:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని భావిస్తుంది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులపై వైకాపా రంగులతో పాటు అప్పటి ముఖ్యమంత్రి జగన్ బొమ్మ ముద్రించిన విషయం తెల్సిందే. దాంతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాత రేషన్ కార్డులలో మార్పులకు శ్రీకారం చుట్టింది. దీంతో భాగంగా రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులతో పాటు కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. 
 
ఈ దరఖాస్తులను సోమవారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకు స్వీకరించడం జరుగుతుంది. గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హులైన వారికి సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీచేస్తారు. ఇప్పటివాటి స్థానంలో కొత్త కార్డులు ఇవ్వనున్నారు. ఈ కొత్త రేషన్ కార్డుల ముద్రణ కోసం అవసరమైన బడ్జెట్‌ను కూడా ప్రభుత్వం కేటాయించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంకా మనదేశంలో పాక్‌కు మద్దతిచ్చేవాళ్లున్నారా? శుద్దీకరణ జరగాల్సిందే: లావణ్య కొణిదెల

భాను దర్శకత్వంలో వినూత్న ప్రేమకథతో చిత్రం రాబోతోంది

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

కన్నప్ప వర్సెస్ సింగిల్ మూవీ ట్రైలర్స్ కు నెటిజన్లు కామెంట్లు !

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments