Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూ డేమోక్రసి దళ కమాండర్ లింగన్న ఎన్కౌంటర్

Webdunia
బుధవారం, 31 జులై 2019 (22:38 IST)
న్యూ డెమోక్రసీ పార్టీ అజ్ఞాత దళానికి, పోలీసులకు జరిగిన ఎదురు కాల్పుల్లో న్యూ డెమోక్రసీ దళ కమాండర్ మృతి చెందగా దళానికి సంబంధించిన, ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన గుండాల మండలంలో జరిగింది. 
 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం అలగడ్డ సమీప అడవిలో పంది గుట్టమీద లింగన్న దళం గత మూడు రోజుల నుండి విశ్రాంతి తీసుకుంటోందన్న సమాచారం తెలిసిన పోలీస్ గ్రే హాండ దళాలు గుట్టను చుట్టుముట్టి లింగన్న దళంపై కాల్పులు జరపడంతో లింగన్న మృతి చెందాడు. ఐదుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉండగా సంఘటనా స్థలానికి ప్రజలను, మీడియాను వెళ్లకుండా సుమారు రెండు గంటలపాటు అడ్డుకున్నారు. అనంతరం జనం గొడవ చేయగా పోలీసులు వదిలి పెట్టారు. జనమంత గుట్ట పైకి వెళ్లే లోగా గుట్ట వెనుక నుండి మృతదేహాన్ని కిందికి దించి వెళ్లిపోతున్న సమయంలో ప్రజల అడ్డుకోగా లింగన్న మృతదేహాన్ని వదిలిపెట్టి కొంతమంది పోలీసులు వెళ్లిపోయారు.

మరికొంతమంది ఆ మృతదేహాన్ని తీసుకోవడానికి రావడంతో ప్రజలు రాళ్లతో పోలీసులపై దాడి చేయగా కానిస్టేబుల్ గాయాలయ్యాయి. పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments