Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చని పందిరి సాక్షిగా ఒక్కటైన జంట... కాళ్ల పారాణి ఆరకముందే వెళ్లిపోయింది...

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (08:40 IST)
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో తీవ్ర విషాదం జరిగింది. పచ్చని పందిరి సాక్షిగా ఒక్కటైన ప్రేమజంట.. కాళ్ల పారాణి ఆరకముందే లోకం విడిచి వెళ్లిపోయింది. వారి జీవన ప్రయాణానికి విధి ముగింపు పలికింది. ఇళ్లకు కట్టిన తోరణాలు వాడటకముందే ఆ కుటుంబంలో చావు డప్పులు మోగాయి. రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృత్యువాతపడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని ఇచ్ఛాపురం పట్టణంలోని బెల్లుపడ కాలనీకి చెందిన గవలపు వేణు అలియాస్ సింహాచలం (26) అనే యువకుడికి బ్రహ్మపురకు చెందిన సుభద్ర అలియాస్ ప్రవల్లిక (23) ఈ నెల 10వ తేదీ అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. సింహాచలం పుణ్యక్షేత్రంలో జరిగిన ఈ వేడుకల్లో బంధుమిత్రులంతా పాల్గొన్నారు. ఆ తర్వాత 12వ తేదీన విందు ఏర్పాటు చేశారు. 
 
ఈ విందుకు అందరూ వచ్చి భోజనం చేసి వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లి వేడుకలు ముగియడంతో అత్తారింటికి నవ దంపతులు బైకుపై బయలుదేరారు. వీరి వాహనం గొళంత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో వెళుతుండగా, ఓ ట్రాక్టర్ బలంగా వచ్చి వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుభద్ర అక్కడే మృత్యువాతపడగా వేణును మాత్రం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. 
 
దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మరోవైపు, ఈ విషాద వార్త తెలుసుకున్న ఇరువురు కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు. వారు ఆర్తనాదాలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి. కాళ్ళపారాణి ఆరకముందే నవ దంపతులు తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారంటూ ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments