ఆషాడానికి పుట్టింటికి వెళ్లొచ్చి ఉన్నీతో ఉరేసుకున్న నవవధువు... ఎక్కడ?

నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సమీపంలో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. ఆషాడానికి పుట్టింటికి వెళ్లిన ఓ నవవధువు భర్తతో మాట్లాడాక ఇంట్లోకి వెళ్లి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2017 (16:12 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సమీపంలో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. ఆషాడానికి పుట్టింటికి వెళ్లిన ఓ నవవధువు భర్తతో మాట్లాడాక ఇంట్లోకి వెళ్లి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం తాళ్లచెరువుకు చెందిన అమరనాథ్‌ అనే వ్యక్తి దంత వైద్యశాల నడుపుతున్నాడు. మే నెలలో హైదరాబాద్‌కు చెందిన సుజల(27)తో అతనికి వివాహమైంది. 
 
వేరుకాపురం పెట్టేందుకు అమరావతిలోని విజయవాడ రోడ్డు సమీపంలో నెలరోజుల క్రితం ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఆషాఢం రావడంతో సుజల పుట్టింటికి వెళ్లి మూడు రోజుల క్రితం అమరావతి చేరుకుంది. శనివారం ఉదయం యథావిధిగా పనులు చేసుకుని మధ్యాహ్నం దంపతులిద్దరూ కలసి భోజనం చేశారు. ఆ తర్వాత సాయంత్రం వైద్యశాలకు వెళ్లిన అమరనాథ్‌ తిరిగి ఇంటికి వచ్చేసరికి వంట గదిలో భార్య చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ బలవన్మరణానికి గల కారణాలు తెలియరాలేదు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments