Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు జిల్లాలో ఘోరం : ఆగివున్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (17:45 IST)
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాళెం మండలం దామరమడుగు మఠం వద్ద రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోగా, మరో 34 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరని జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీని ఢీకొట్టిన తర్వాత బస్సు 15 అడుగుల లోతులో ఉన్న పంట పొలాల్లో బోల్తాపడింది. దీంతో ఓ మహిళా ప్రయాణికురాలు చనిపోయారు. 
 
ఆత్మకూరు నుంచి నెల్లూరుకు వెళుతున్న పల్లెవెలుగు బస్సు నెల్లూరు - కడప రహదారిలో రోడ్డు పక్కన మఠం కాలనీ వద్ద ఆగివున్న లారీని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments