Webdunia - Bharat's app for daily news and videos

Install App

15న నెల్లూరు జిల్లాలో చేపల వేటపై నిషేధం.. ఎందుకు?

Webdunia
శుక్రవారం, 12 జులై 2019 (16:43 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని చేపట్టనుంది. ఆ ప్రయోగ సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాలు జారీచేశారు. జిల్లాలోని శ్రీహరికోట సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున 2.51 గంటల సమయంలో జీఎస్‌ఎల్వీ మార్క్‌-3 ద్వారా చంద్రయాన్‌-2 రాకెట్‌ ప్రయోగం నిర్వహించనున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆ రోజు వేకువజాము ఒంటిగంట నుంచి 4 గంటల మధ్యలో మత్స్యకారులు ఎవరూ నిర్ణీత అపాయకర ప్రాంతమైన పులికాట్‌ లైట్‌హౌస్‌ నుంచి ఆర్మగాన్‌ లైట్‌హౌస్‌ వరకు చేపలవేటకు వెళ్లరాదని జిల్లా కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు ఒక ప్రకటనలో ఆదేశించారు. ఈ విషయమై మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు, తహసీల్దార్లు, వీఆర్‌వోలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ ప్రమాదానికి గురికాకుండా పర్యవేక్షించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments