Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాపురానికి రాని భార్య... అత్తను నరికి చంపిన అల్లుడు

Webdunia
గురువారం, 14 మే 2020 (08:46 IST)
నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. ఆ భార్య భర్తతో సంసారం చేసేందుకు నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన భర్త.. ఆమె తల్లిని అంటే అత్తను నరికి చంపేశాడు. ఈ దారుణ ఘటన జిల్లాలోని దూబగుంట గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దూబగుంట గ్రామానికి చెందిన తిరుపాల్ అనే వ్యక్తి కొన్నేళ్ళ క్రితం చౌట భీమవరానికి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే, తిరుపాల్‌ పచ్చి తాగుబోతు. 
 
ప్రతిరోజూ మద్యం సేవించి వచ్చి భార్యను చిత్ర హింసలకు గురిచేసేవాడు. పలు మార్లు చితకబాదాడు. భర్త వేధింపులు భరించలేని భార్య... యేడాది క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత కాపురానికి రావాలంటూ పలుమార్లు ప్రాధేయపడ్డాడు. 
 
అయినప్పటికీ భార్య ససేమిరా అన్నది. దీంతో ఆగ్రహించిన తిరుపాల్.. బుధవారం ఉదయం పీకల వరకు మద్యం సేవించి.. అత్తగారింటికి వెళ్లాడు. మళ్లీ కాపురానికి రావాలంటూ భార్యతో గొడవడుతున్నారు. 
 
ఆ సమయంలో అత్త పోలమ్మ అడ్డు వచ్చింది. దీంతో తిరుపాల్ నిగ్రహం కోల్పోయి అత్తపై విచక్షణారహితంగా దాడి చేసి, నరికి చంపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పోలమ్మ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments