Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణంలో ఏర్పడిన స్నేహం.. ప్రేమగా మారింది.. ఆపై శారీరకంగా?

ప్రయాణంలో ఏర్పడిన స్నేహం.. ప్రేమగా మారింది. ఆపై శారీరకంగా కలిసింది. చివరికి పెళ్లి పేరెత్తగానే దూరమైంది. ఈ ఘటనలో నెల్లూరుకు చెందిన యువతి చివరికి మోసపోయింది. వివరాల్లోకి వెళితే.. బాధితురాలు ఆమెను మోసం

Webdunia
సోమవారం, 25 జూన్ 2018 (11:52 IST)
ప్రయాణంలో ఏర్పడిన స్నేహం.. ప్రేమగా మారింది. ఆపై శారీరకంగా కలిసింది. చివరికి పెళ్లి పేరెత్తగానే దూరమైంది. ఈ ఘటనలో నెల్లూరుకు చెందిన యువతి చివరికి మోసపోయింది. వివరాల్లోకి వెళితే.. బాధితురాలు ఆమెను మోసం చేసిన వ్యక్తి ఇద్దరూ నెల్లూరు జిల్లాకు చెందిన వారే.. ఇద్దరూ చెన్నైలో ఒకే కంపెనీలో పనిచేస్తుంటారు. దీంతో సహజంగానే వారి మధ్య పరిచయం స్నేహంగా మారింది. 
 
నిత్యమూ కలసి నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్లి, తిరిగి వచ్చే క్రమంలో అమ్మాయితో వచ్చేవాడు.. నెల్లూరుకు చెందిన నల్లమోలు దివ్యతేజ అనే యువకుడు. ఆపై ఇద్దరూ స్నేహితులయ్యారు. ఈ క్రమంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. 
 
పెళ్లి చేసుకుంటానని చెప్పిన తేజ, యువతిని శారీరకంగా లోబరచుకున్నాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని బాధితురాలు అడగటంతో దూరం పెట్టడం ప్రారంభించాడు. యువతి తన తల్లిదండ్రులకు విషయం చెప్పగా, వారు తేజ తల్లిదండ్రులను కలసి ఇద్దరికీ పెళ్లి చేద్దామని కోరారు. 
 
వారెవరూ పెళ్లికి అంగీకరించేది లేదని తెగేసి చెప్పేశారు. అంతటితో ఆగకుండా చంపేస్తామని బెదిరించారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా, దివ్యతేజతో పాటు ఆయన తల్లి, సోదరులపై కేసు పెట్టి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments