Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట.. మహిళను వివస్త్రని చేసి కొందరు యువకులు అమానుషంగా..?

Webdunia
శుక్రవారం, 14 ఆగస్టు 2020 (14:54 IST)
లాక్ డౌన్ కాలంలో మహిళల అకృత్యాలు, నేరాలు పెరిగిపోయాయని వార్తలు వస్తున్న తరుణంలో ఓ అమానుష ఘటన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. కొందరు యువకులు మృగాలుగా మారి ఓ యువతి పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. వివస్త్రని చేసి ..దుస్తులు ఇవ్వకుండా వికృత చేష్టలకు పాల్పడ్డారు. నెల్లూరులోని వెంకటేశ్వరపురం జనార్దన్‌రెడ్డి కాలనీలో బుధవారం రాత్రి జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. మహమూర్‌ మసీదు వెనక గొర్రెల మండీ ఉంది. దీని పక్కన నిర్మానుష్యంగా ఉండటంతో చీకటి కార్యకలాపాలకు వేదికగా మారింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఓ గొర్రెల కాపరి అటువైపు వెళుతుండగా ఓ ఆటో నిలిపి ఉంది. ఆ ప్రాంతంలో ఎందుకుందో అనుకుంటూ..అనుమానం వచ్చి చూడగా ఆరుగురు యువకులు కలసి ఒక యువతిని వివస్త్రను చేసి దుస్తులు ఇవ్వకుండా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో ఆయన తన దగ్గరున్న టార్చ్‌లైటు వేయడంతో వారు ఆటోలో అక్కడి నుంచి పరారయ్యారు. 
 
ఆటో వెనుక ఓ సినిమా నటుడి స్టిక్కర్‌ ఉన్నట్లు గుర్తించారు. గొర్రెల కాపరి యువతికి దుస్తులు ఇవ్వడంతో ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనపై నవాబుపేట సీఐ వేమారెడ్డిని వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని.. విచారణ జరుపుతామన్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments