Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయీమ్ ఎన్‌కౌంటర్‌‌పై కేసీఆర్ మాట.. మొత్తం ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ.143 కోట్లు

నయీమ్ ఎన్‌కౌంటర్‌పై సోమవారం తెలంగాణ అసెంబ్లీలో చర్చ సాగింది. రెండున్నర దశాబ్దాలుగా నయీం ముఠా ఎన్నో అరాచకాలకు పాల్పడిందని తెలంగాణా సీఎం కేసీఆర్ అన్నారు. నయీం కూడబెట్టిన మొత్తం ఆస్తుల రిజిస్ట్రేషన్ విలు

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2016 (14:30 IST)
నయీమ్ ఎన్‌కౌంటర్‌పై సోమవారం తెలంగాణ అసెంబ్లీలో చర్చ సాగింది. రెండున్నర దశాబ్దాలుగా నయీం ముఠా ఎన్నో అరాచకాలకు పాల్పడిందని తెలంగాణా సీఎం కేసీఆర్ అన్నారు. నయీం కూడబెట్టిన మొత్తం ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ.143 కోట్లని తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక నయీం కదలికలపై నిఘా ఉంచామని తెలిపారు. 
 
గత ఆగస్టు 8న నయీం ముఠా మిలీనియం టౌన్ షిప్ లో మారణాయుధాలతో తిరుగుతుండగా పోలీసులకు సమాచారం అందిందని, వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని అతని అరెస్టుకు ప్రయత్నించగా ఆ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో నయీం హతమయ్యాడని వివరించారు. నయీం దందాపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.. అతని అరాచకాలపై 174 కేసులు నమోదయ్యాయి. 
 
ఈ కేసులో 741 మంది సాక్షులను విచారించారు. ఇప్పటివరకు 124 మంది నిందితులు అరెస్టు అయ్యారని కేసీఆర్ వెల్లడించారు. నయీం కబ్జాలో ఉన్న వెయ్యి ఎకరాలకు పైగా భూమిని, అతనికి చెందిన 37 ఇళ్ళను స్వాధీనం చేసుకున్నట్టు కేసీఆర్ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments