Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసభ్య పదజాలంతో దూషించారంటూ అయ్యన్నపాత్రుడిపై కేసు

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (10:20 IST)
పోలీసులను, అధికార వైకాపా పార్టీ నేతలను అసభ్య పదజాలంతో దూషించారంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయ్యన్నపాత్రుడుతో సహా మొత్తం 9 మంది తెదేపా నాయకులపై అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పోలీసులు కేసులు నమోదు చేశారు. 
 
నర్సీపట్నంలో మరిడి మహాలక్ష్మి పండుగ పెద్ద జాగారం వేడుకలు జరిగాయి. ఇందులోభాగంగా ఈ నెల 15వ తేదీన అబీద్ కూడలిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అయ్యన్నపాత్రుడుతో పాటు మరికొందరు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. 
 
రాత్రి 11.10 గంటల సమయంలో అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ తదితరులు పోలీసులను, వైకాపా నేతలను దూషించి, పోలీసుల విధులకు ఆటంకాలు కలిగించారని పేర్కొంటూ నర్సీపట్నం పోలీసులు ఐపీసీ 353, 294 (ఏ, బి), 504, 505(ఏ), రెడ్‌విత్ 34 కింద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments