సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన బీజేపీ కేంద్రంలో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మరోమారు ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం రాత్రి రాష్ట్రపతి భవన్లో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. నరేంద్ర మోడీతో పాటు.. 58 మంది మంత్రులకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. ప్రధాని మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారి పేర్లను పరిశీలిస్తే,
రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, సదానంద గౌడ, నిర్మలా సీతారామన్, రాంవిలాస్ పాశ్వాన్, స్మృతి ఇరానీ, ప్రకాష్ జావదేకర్, పియూష్ గోయల్లు ఉండగా, వీరిలో అమిత్ షా తొలిసారి కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. అలాగే, మొత్తం 58 మంత్రుల్లో 25 మంది కేంద్ర మంత్రులు కాగా, 9 మంది స్వతంత్ర హోదా కలిగిన మంత్రులుగా, 24 మంది కేంద్ర సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.