జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్పై సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఎక్స్ట్రా ప్లేయర్లా వ్యవహరిస్తున్నారని నారాయణ వ్యాఖ్యానించారు. పేదలకు న్యాయం జరిగితే సీపీఐ పోరాటానికి దిగుతుందని, కేంద్రాన్ని చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిలకు పంచెలు తడుస్తున్నాయని ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల పేరుతో పేదలకు ఇవ్వాల్సిన భూములను ప్రభుత్వం లాక్కోవడం సరికాదని నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని కరవు జిల్లాలను వెంటనే గుర్తించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే.. జగ్గయ్యపేటలో ఉద్యోగాలు ఇప్పిస్తానని వైసీపీ నేత నంబూరి రవి మోసం చేసిన ఘటన మరవక ముందే, మరో వైసీపీ నేత మోసం వెలుగులోకి వచ్చింది. ఆ పార్టీ నేత దువ్వాడ శ్రీనివాస్ ఆసుపత్రి పెడతామని చెప్పి ఓ డాక్టర్ నుంచి కోటి రూపాయలు వసూలు చేసి మోసిగించిన వైనం శ్రీకాకుళం జిల్లాలో వెలుగుచూసింది. దానిపై వైద్యుడు ఫిర్యాదు చేయడంతో శ్రీనివాస్ను పోలీసులు అరెస్టు చేశారు.