Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారెవ్వా.. రాజన్న రాజ్యంలో ఎమ్మెల్యేల దుస్థితి ఇదీ.. లోకేశ్ ట్వీట్

Webdunia
మంగళవారం, 23 జులై 2019 (14:22 IST)
వారెవ్వా.. రాజన్న రాజ్యంలో ఎమ్మెల్యేల దుస్థితి అత్యంత హీనంగా ఉందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా, మంగళవారం ముగ్గురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత వారంతా బయటకు వెళ్లకపోవడంతో మార్షల్స్‌తో బలవంతంగా బయటకు పంపించారు. 
 
దీనిపై నారా లోకేశ్ ట్వీట్ చేశారు. సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యేలను బయటకు తరలిస్తున్న ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన లోకేశ్.. దానికింద ట్వీట్ చేశారు. "వారెవ్వా... ప్రజల పక్షాన నిలిస్తే..  రాజన్న రాజ్యంలో నాయకుల పరిస్థితి ఇదీ..!" అంటూ కామెంట్స్ చేశారు. 
 
కాగా, సభా కార్యక్రమాలకు నిత్యమూ అడ్డుపడుతున్నారన్న కారణంతో ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బుచ్చెయ్య చౌదరిలను ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకూ సస్పెండ్ చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, సభ దాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. 

 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments