Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి పెట్టుబడుల కోసం.. వచ్చే నెల 3న అమెరికాకు నారా లోకేష్!

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (10:39 IST)
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో కొత్త రాష్ట్రానికి పెట్టుబడుల కోసం సీఎం హోదాలో నారా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలకు వెళ్తున్న తరుణంలో.. ఆయన తనయుడు, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ కూడా రంగంలోకి దిగుతున్నారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన వచ్చే నెల 3న అమెరికా వెళుతున్నారు.
 
ఏకంగా పది రోజుల పాటు అక్కడే ఉండే ఆయన అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తారట. ఆయా రాష్ట్రాల గవర్నర్లు, పారిశ్రామికవేత్తలతో ఆయన వరుస భేటీలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతోనూ భేటీ అయ్యేందుకు ఆయన కసరత్తు చేస్తున్నారని సమాచారం. 
 
గతంలో అమెరికాలో విద్యాభ్యాసం, కొంతకాలం పాటు అక్కడే ఉద్యోగం చేసిన అనుభవం నేపథ్యంలో అక్కడ నారా లోకేష్‌కు పెద్ద సర్కిలే ఉంది. తాజాగా తానా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన సతీశ్ వేమనతోనూ లోకేశ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా పర్యటనలో లోకేశ్, మంచి ఫలితాలను రాబట్టడం ఖాయంగానే కనిపిస్తోంది.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments