Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చేవారం నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2023 (09:22 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో యువగళం పాదయాత్రను ఆయన కుమారుడు నారా లోకేష్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే వారం నుంచి యువగళం పాదయాత్రను పునఃప్రారంభించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యోచిస్తున్నట్లు సమాచారం. 
 
చంద్రబాబు అరెస్ట్ తర్వాత తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడలో లోకేష్ పాదయాత్ర నిలిచిపోయింది. అక్కడి నుంచి యువగళం పాదయాత్ర పునఃప్రారంభం కానుంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత పరిస్థితిపై లోకేష్ పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పాదయాత్రను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు.
 
వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు బాబుపై అవినీతి మరకలు పెట్టలేకపోయారని ఈ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ప్రజలు, టీడీపీ నేతలు చేస్తున్న నిరసన కార్యక్రమాలను వైసీపీ ప్రభుత్వం పోలీసులతో అణిచివేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
నిరసన తెలిపిన వారిపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు కేసుకు సంబంధించి ఢిల్లీలోని లాయర్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు లోకేష్ తెలిపారు. కోర్టులో పోరాడుతూనే ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. 
 
చంద్రబాబు అరెస్టును, వైసీపీ ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నేతలంతా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments