Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ శాఖను నారా లోకేష్‌కు ఇచ్చేస్తారా... మంత్రి బొజ్జకు మీడియా ప్రశ్న

త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న తరుణంలో ప్రస్తుత మంత్రులకు భయం పట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరిని మంత్రుల పదవుల నుంచి తొలగిస్తారేమోనని వణికిపోతున్నారు. ప్రధానంగా బొజ్జల గోపాలకృష్ణారె

Webdunia
ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (14:50 IST)
త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న తరుణంలో ప్రస్తుత మంత్రులకు భయం పట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరిని మంత్రుల పదవుల నుంచి తొలగిస్తారేమోనని వణికిపోతున్నారు. ప్రధానంగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో పాటు ఐటీ, సమాచార శాఖామంత్రి పల్లె రఘునాథ రెడ్డి, పీతల సుజాత, రావెళ్ళ కిషోర్ బాబులకు పదవులు పోయినట్లేనని ఇప్పటికే వదంతులు వినిపిస్తున్నాయి. సమాచార శాఖామంత్రిగా ఉన్న పల్లె రఘునాథ రెడ్డికి మాత్రం పదవి పోదు గానీ ఆయనకు కేటాయించిన ఒక శాఖను మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
 
ఎందుకంటే తెలంగాణాలో కేసీఆర్ తన కుమారుడికి ఐటీ శాఖను అప్పజెప్పినట్లుగా చంద్రబాబు కూడా తన కుమారుడు లోకేష్‌కు ఐటీ శాఖని అప్పజెప్పే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే పల్లెరఘునాథ రెడ్డి ఆలోచనలో పడ్డారు. ఉన్న శాఖను మార్పు చేస్తే ఏం చేయాలో పాలుపోక తికమకపడుతున్నారు. 
 
ఇదేవిషయాన్ని తిరుపతిలో ఒక మీడియా ప్రతినిధి పల్లె రఘునాథ రెడ్డిని ప్రశ్నించగా ఆయన కొద్దిసేపు నీళ్ళు నమిలారు. అదంతా చంద్రబాబు ఇష్టం అని అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. మొత్తం మీద లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వడం చాలామంది మంత్రుల్లో భయం పట్టుకుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments