Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూలు ప్రమాద బాధితులు నారా లోకేష్ పరామర్శ.. ఆర్థిక సాయం!

Webdunia
గురువారం, 31 జులై 2014 (11:38 IST)
మెదక్ జిల్లా మాసాయిపేట రైల్వే క్రాసింగ్ వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొన్న సంఘటనలో మరణించిన చిన్నారుల కుటుంబాలను తెలుగుదేశం యువ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పరామర్శించారు. ప్రమాదంలో మరణించిన చిన్నారుల కుటుంబాలకు సరైన నష్టపరిహారం అందజేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరుతానని చెప్పారు. 
 
మరణించిన చిన్నారుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడానికి ఆయన మెదక్ జిల్లాలో పర్యటించారు. గజ్వేల్‌ నియోజకవర్గంలోని తూఫ్రాన్, ఇస్లాంపూర్, గుండ్రెడ్డిపల్లి, వెంకటాయపల్లి, కిష్టాపూర్, గన్‌పూర్, వేలూరులలో లోకేష్ పర్యటించి, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఒక్కో చిన్నారి కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. అలాగే మరణించిన చిన్నారుల కుటుంబలోని పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్ట్ పాఠశాలలో ఉచితంగా విద్యాబోధన చేస్తామని, వారు ఎంతవరకు చదువుకున్నా ఆ బాధ్యతను టీడీపీ చేపడుతుందని వారికి హామీ ఇచ్చారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments