Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేష్ గుంటూరు పర్యటన: అనూష కుటుంబానికి పరామర్శ

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (10:53 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుంటూరు జిల్లా నరసరావుపేట పర్యటనకు రానున్నారు. నరసరావుపేటలో హత్యకు గురైన ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు రానున్నారు. 
 
అనూష పుట్టినరోజును ఆమె ఇంట్లోనో, స్థానిక టీడీపీ కార్యాలయంలో చేపట్టిన కార్యక్రమంలో లోకేశ్‌ పాల్గొని ప్రభుత్వం తీరుపై నిరసన తెలిపేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బుధవారం టీడీపీ నేతలు దరఖాస్తు ఇచ్చేందుకు వెళ్లగా పోలీసు అధికారులు నిరాకరించారు.
 
నరసరావుపేటలో లోకేష్ పర్యటనకు అనుమతి లేదని గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమవర్మ తెలిపారు. కోవిడ్‌ నిబంధనలతో పాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రాజకీయపరమైన కార్యక్రమాలకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. 
 
మహిళలపై జరిగే నేరాలను రాజకీయం చేయవద్దని.. రమ్య కేసు విషయంలోనూ ఇదేవిధంగా రాజకీయం చేశారన్నారు. ఫిబ్రవరిలో అనూష హత్యకు గురైతే, ఇప్పుడు ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు లోకేష్ వస్తుండటం రాజకీయం కోసమేనన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments