ప్రతిపక్షనేత జగన్మోహన్రెడ్డిపై మరోసారి ఫైరయ్యారు నారా లోకేష్. ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి తన నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. లేకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు నారా లోకేష్. తిరుపతిలో జరిగిన మహానాడును విజయవంతం చేసిన సంధర్భంగా ఆ కార్యక
ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిపై మరోసారి ఫైరయ్యారు నారా లోకేష్. ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి తన నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. లేకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు నారా లోకేష్. తిరుపతిలో జరిగిన మహానాడును విజయవంతం చేసిన సంధర్భంగా ఆ కార్యక్రమానికి తీవ్రంగా కృషి చేసిన వారిని నారా లోకేష్ ఘనంగా సన్మానించారు. తిరుపతి సమీపంలోని రామచంద్రాపురంలో కార్యక్రమాన్ని మాజీమంత్రి గల్లా అరుణకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు.
చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవం అంత వయస్సు లేని జగన్ ఆయన పైనే విమర్శలు చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. అనవసరంగా జగన్ తనపై ఆరోపణలు చేస్తున్నారని, ఒక్క ఆరోపణను జగన్ నిరూపించినా జగన్ ఉన్న చంచల్ గూడ జైలుకు వెళ్ళి కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. పార్టీకి గానీ, తన కుటుంబానికి గానీ చెడ్డపేరు వచ్చే పని ఎప్పటికీ తాను చేయనన్నారు స్పష్టం చేశారు నారా లోకేష్. తెదేపాకు కార్యకర్తలే పట్టుగొమ్మలన్నారు.