Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్, కల్తీ మ‌ద్యంతో జాతి నిర్వీర్యం అవుతోంది: చంద్రబాబు

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (11:30 IST)
డ్రగ్స్, కల్తీ మ‌ద్యంతో జాతి నిర్వీర్యం అవుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ ముఖ్యనేతలతో  చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గంజాయి, హెరాయిన్ స్మగ్లర్లే రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని శాసిస్తున్నారని ఆరోపించారు. పాడేరు ఏజెన్సీలో లిక్విడ్ గంజాయి, ఐస్‌క్రీం, చాక్లెట్ల తయారీ చేస్తున్నారని ఆరోపించారు. 
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రెండున్నరేళ్లలో విద్యుత్ వినియోగదారులపై రూ.36,802 కోట్ల భారం పడిందని చంద్ర‌బాబు తెలిపారు. ప్రజా రక్షక పోలీస్ వ్యవస్థ.. ప్రజా భక్షక వ్యవస్థగా మారిందని ధ్వజమెత్తారు. బాధితులకు న్యాయం జరిగేలా ప్రైవేట్ కేసులు వేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇంద్రకీలాద్రి, తిరుమలలో అన్యమత ప్రచారం దుర్మార్గంమన్నారు. విమానాల్లో వాడే ఫ్యూయల్ కంటే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉందని విమర్శించారు. ఆరు దశల్లో పరిశీలన పేరుతో పెన్షన్, రేషన్ కార్డులు కోత పెడుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

మంగ్లీ డ్రగ్ పార్టీలో మేం లేవంటున్న రచ్చ రవి, దివి వాద్య, కాసర్ల శ్యామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments