Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనం బ్రదర్స్ మంచివారు... భావితరాల కోసం పనిచేయాలి: చంద్రబాబు

Webdunia
ఆదివారం, 17 జనవరి 2016 (16:01 IST)
నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం బ్రదర్స్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. ఆనం బ్రదర్స్ మంచివారంటూ కితాబిచ్చారు. ఈ జిల్లాలో సీనియర్ నేతలుగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి, ఆనం వివేకానందరెడ్డి అనుచరులు రెండు వేల మంది ఆదివారం టీడీపీలో చేరారు. 
 
విజయవాడ ఏ1 కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడుతూ... ఆనం బ్రదర్స్‌, అనుచరులను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ స్వలాభం కోసం అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిందని విమర్శించారు. హేతుబద్ధత లేని విభజన వల్ల రాష్ట్రం చాలా నష్టపోయిందన్నారు. 
 
రాష్ట్రంలో ప్రస్తుతం అనేక సమస్యలు ఉన్నాయని... భావితరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని నాయకులకు సూచించారు. కష్టాలను సమర్థంగా ఎదుర్కొంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వివరించారు. కష్ట సమయంలోనూ రైతుల రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. రాష్ట్ర మంత్రులు నారాయణ, దేవినేని ఉమామహేశ్వరావు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, వివేకానందరెడ్డి, పలువురు తెదేపా నేతలు పాల్గొన్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments