Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలూ... కత్తులు.. చాకులు వెంటపెట్టుకోండి.. అలాంటివారి మర్మాంగాలు కోసెయ్యండి : నన్నపనేని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేట‌ప్పుడు అమ్మాయిలు తమ వెంట క‌త్తులు, చాకులు వెంట‌పెట్టుకుని వెళ్లాల‌ని సూచించారు.

Webdunia
బుధవారం, 24 మే 2017 (15:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేట‌ప్పుడు అమ్మాయిలు తమ వెంట క‌త్తులు, చాకులు వెంట‌పెట్టుకుని వెళ్లాల‌ని సూచించారు. అంతేకాకుండా, కామంతో కళ్లుమూసుకునిపోయి అత్యాచారానికి పాల్పడే పురుషుల మర్మాంగాలను కోసెయ్యాలని ఆమె పిలుపునిచ్చారు. 
 
విశాఖపట్టణంలో అత్యాచార బాధితులను ఆమె బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అమ్మాయిలు, మహిళలు తమ రక్షణార్థం కత్తులు, చాకులు తీసుకెళ్లాలని సూచించారు. ఒకవేళ పురుషులు ఎవరైనా అత్యాచానికి ప్రయత్నిస్తే వారి మర్మాంగాన్ని కోసిపారెయ్యాలని ఆమె సూచించారు. 
 
కేర‌ళ‌లో ఓ అమ్మాయి త‌న‌పై అత్యాచారానికి పాల్ప‌డుతున్న‌ ఓ బాబా మ‌ర్మాంగాన్ని కోసేసింద‌ని, ఆ రాష్ట్ర సీఎం ఆమెపై కేసు లేకుండా చేశార‌ని గుర్తు చేశారు. త‌మ వెంట‌ప‌డి అకృత్యాల‌కు పాల్ప‌డే వారి పట్ల అమ్మాయిలు ఆ కేరళ యువతిలాగే ప్రవర్తించాలని పిలుపునిచ్చారు. అమ్మాయిలు చాలా జాగ్ర‌త్తగా ఉండాల‌ని సోష‌ల్ మీడియాలో అబ్బాయిల‌తో ప‌రిచ‌యాలు పెంచుకొని మోసపోవ‌ద్ద‌ని హితవు పలికారు. త‌మ వెంట ప‌డే వారిపై మాత్రం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించి, ఎదురుతిర‌గాల‌ని నన్నపనేని రాజకుమారి పిలుపునిచ్చారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments